హుజూర్నగర్లో టీఆర్ఎస్ గెలిస్తే అహంకారం పెరిగిపోతుంది
హుజూర్నగర్ ఉపఎన్నిక దగ్గర పడేకొద్దీ అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరిపోతుంది. తాజాగా కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ మంత్రి జగదీశ్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
హుజూర్నగర్ ఉపఎన్నిక దగ్గర పడేకొద్దీ అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరిపోతుంది. తాజాగా కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ మంత్రి జగదీశ్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. మంత్రి జగదీశ్ రెడ్డి పనైపోయిందని, అందుకే ఆయనను కాదని పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఇన్చార్జీగా నియమించారాని దీనికి ఆత్మహత్య చేసుకోవాలని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ గెలిస్తే అహంకారం పెరిగిపోతుందని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నాయకులు మాటలకే పరిమితమయ్యారు తప్ప చేసిన అభివృద్ధి ఏమి లేదని విమర్శిచారు. టీఆర్ఎస్ను హుజూర్నగర్లో ఓడించాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.