బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు బ్రేక్‌.. పాదయాత్ర ఆపకపోతే చట్టరీత్యా..

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు బ్రేక్‌ పడింది.

Update: 2022-08-23 10:31 GMT

బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు బ్రేక్‌.. పాదయాత్ర ఆపకపోతే చట్టరీత్యా..

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు బ్రేక్‌ పడింది. పాదయాత్ర ఆపాలంటూ వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు బండి సంజయ్‌కు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాదయాత్రకు అనుమతిలేదని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా గత కొంతకాలంగా 3వ విడత ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతోంది. అయితే రెచ్చగొట్టేలా పదే పదే వ్యాఖ్యలు చేయడం, ఇతర కారణాలతో ప్రజాసంగ్రామ యాత్రకు బ్రేక్‌ వేయాలని పోలీసులు సూచించారు. పాదయాత్ర ఆపకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు.

Tags:    

Similar News