Warangal: వరంగల్‌ ఎల్బీనగర్‌లో నిన్నటి హత్య కేసులో పురోగతి

Warangal: ప్రధాన నిందితుడు షఫీ సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Update: 2021-09-02 06:51 GMT
representational Image

Warangal: వరంగల్‌ ఎల్బీనగర్‌లో నిన్నటి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడు షఫీ సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా స్కెచ్‌తో హత్య చేసినట్లు విచారణలో షఫీ వెల్లడించినట్లు తెలుస్తోంది. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 1.20 కోట్ల వివాదంతో హత్యకు ప్లాన్‌ చేసినట్లు విచారణలో వెల్లడయ్యింది. ఇరువురి మధ్య మూడేళ్లుగా వివాదం కొనసాగుతోందని చాంద్‌ పాషాను మాత్రమే హత్య చేసేందుకు ప్లాన్‌ చేసుకున్నారని కుటుంబం అడ్డురావడంతో అందరిపై దాడి చేసినట్లు షఫీ వెల్లడించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News