ఆర్టీసీ రూట్ల ప్రయివేటీకరణపై దాఖలైన పిటిషన్ ను హై కోర్టు విచారించింది. తెలంగాణ క్యాబినేట్ ప్రొసిడింగ్స్ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అలాగే ఆర్టీసీ మేనేజ్ మెంట్ కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. సోమవారం వరకు ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆర్టీసీ రూట్లలో ఐదువేల ఒక వంద బస్సుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను న్యాయస్థానం విచారణకు చేపట్టింది. తదుపరి విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.