ట్వీట్టర్ ఖాతాల సస్పెన్షన్‎పై స్పంధించిన పవన్ కళ్యాన్

జనసేన పార్టీకి చెందిన వారి ఖాతాలనే ఎందకు సస్పెన్షన్ చేశారో తెలియడం లేదు. తమ సామాజిక మాధ్యమ ఖాతాలను పునరుద్ధరించాలని పవన్ కళ్యాన్ డిమాండ్ చేశారు.

Update: 2019-09-18 10:21 GMT

జనసేన పార్టీకి చెందిన 400 ట్విట్టర్ ఖాతాలను సస్పెన్షన్ చేయడంపై ఆపార్టీ అధినేత పవన్ కళ్యాన్ స్పంధించారు. తమ పార్టీకి చెందిన వారి ఖాతాలనే ఎందుకు సస్పెండ్ చేశారో తెలియడం లేదన్నారు. ప్రజల కోసం జనసైనికులు నిలబడినందుకే ఈ ఖాతాలను తొలిగించారా అని ట్వీట్టర్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. తమ సామాజిక మాధ్యమ అన్ని ఖాతాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్వీటర్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా భారీ ఫాలోయింగ్ ఉన్న ట్రెండ్ పీఎస్ పీకే, పవనిజం నెట్ వర్క్, వరల్డ్ పీఎస్ పీకే ఫ్యాన్స్, దాస్ పీఎస్ పీకే వంటి ఖాతాలను కూడా బ్లాక్ చేసింది.


Tags:    

Similar News