నేడు పట్నం మహేందర్రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం
Telangana Cabinet: మంత్రిగా మహేందర్రెడ్డిని ప్రమాణ స్వీకారం చేయించనున్న తమిళిసై
నేడు పట్నం మహేందర్రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం
Telangana Cabinet: నేడు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. రాజ్ భవన్లో మధ్యాహ్నం 3గంటల 30నిమిషాలకు మంత్రిగా పట్నం మహేందర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మహేందర్రెడ్డితో గవర్నర్ తమిళిసై మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించున్నారు. ప్రమాణస్వీకారానికి సీఎం కేసీఆర్ సహా..మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకానున్నారు. తెలంగాణలో రెండవ సారి మంత్రిగా మహేందర్ రెడ్డి కొనసాగనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం మహేందర్ రెడ్డికి ఇచ్చే శాఖ పై క్లారిటీ రానుంది. కాగా ఇప్పటికే మహేందర్రెడ్డి సీఎం కేసీఆర్ను కలిశారు.