108 డోర్ లాక్..గాల్లో ప్రాణం...
హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో విషాదం నెలకొంది. బేగంపేట నుండి ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే 108కు సమాచారం అందించారు తోటి ప్రయాణికులు.
హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో విషాదం నెలకొంది. బేగంపేట నుండి ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే 108కు సమాచారం అందించారు తోటి ప్రయాణికులు. స్టేషన్కు వచ్చిన 108 వాహనం డోర్ తెరుచుకోక పోవడంతో ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. అల్మాస్ గూడకు చెందిన ఆనంద్ (50) బేగంపేటలో కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. బేగంపేట నుంచి ఫలక్నుమాకు ఎంఎంటీఎస్లో వెళ్తున్న సమయంలో మలక్పేట స్టేషన్ వద్ద ఆనంద్ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో ప్రయాణికులు 108కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అంబులెన్స్ వద్దకు ఆనంద్ను తీసుకెళ్లగా అబులెన్స్ డోర్ లాక్పడి ఉండటంతో అది ఓపెన్ కాలేదు. అబులెన్స్ అద్దాలు పగుల గొట్టేందుకు 20 నిముషాల సమయం పట్టింది. ఈ లోపు ఆనంద్ చనిపోయాడు.