Hyderabad: ఓయూలో విషాదం.. గుండెపోటుతో విద్యార్థి మృతి

Hyderabad: అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించిన గాంధీ హాస్పిటల్ డాక్టర్లు

Update: 2024-01-20 09:16 GMT

Hyderabad: ఓయూలో విషాదం.. గుండెపోటుతో విద్యార్థి మృతి

Hyderabad: హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్‌లో విషాదం చోటు చేసుకుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఓ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. ఓయూ కామర్స్ కాలేజీలో ఎంకామ్ పూర్తి చేసిన చిరంజీవి.. యూనివర్సిటీలోని డి బ్లాక్ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అయితే సడెన్‌గా హార్ట్ స్ట్రోక్ రావడంతో తోటి విద్యార్థులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చిరంజీవి చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.

Tags:    

Similar News