మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పిదాలపై హైదరాబాద్లో ధర్నాకు సీపీఎం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే సోమవారం తెల్లవారుజాము నుంచి ధర్నాకు సిద్దమైన జూలకంటిని పోలీసులు ఇంట్లోనే నిర్బంధించారు. రాష్ట్రంలో హక్కులను కాలరాస్తున్నారని, పోలీసులు బలవంతంగా అరెస్టులు చేసి నిర్బంధించడం అక్రమమని జూలకంటి పేర్కొన్నారు. అరెస్టు చేసిన వాళ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ అఖిలపక్షం నేతృత్వంలో సోమవారం ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించనున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించిన తీరును నిరసిస్తూ చేపట్టిన తమ పోరాటాన్ని జయప్రదం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి పార్టీ శ్రేణులను కోరారు.