ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలో రిలే నిరహార దీక్షలు చేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిల అరెస్ట్ చేయడాన్ని కార్మికులు ఖండించారు. ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యపరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆందోళనలో భాగంగా ఆలంపూర్ నుంచి కొత్తూరు వరకు రహదారిని దిగ్బంధించి రవాణా వ్యవస్థను స్థంభింప చేయనున్నట్లు ప్రకటించారు.