తెలంగాణలో మరో కరోనా పాజిటీవ్ కేసు నమోదైంది. నిన్న రాత్రి ఇటలీ నుంచి వచ్చిన మహిళకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెతో పాటు వచ్చిన మరో ఇద్దరి శాంపుల్స్ పుణెకు పంపించారు.
కరోనాపై తెలంగాణ సర్కార్ హై అలర్ట్ ప్రకటించింది. కరోనాపై హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. సాయంత్రం 6 గంటలకు కేబినెట్ సమావేశంకానుంది. కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలపై చర్చించనున్నారు. అనంతగిరిలోని హరిత రిసార్ట్స్లో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.