వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సిబ్బంది అలసత్వం మరోసారి బయట పడింది. మొక్కులు తీర్చుకోడానికి వచ్చిన మంచిర్యాల జిల్లా కోహెడకు చెందిన భక్తుడు ధర్మ శివరాంకు చేదు అనుభవం ఎదురయింది. మొక్కులు తీర్చుకుని స్వామి వారి ప్రసాదం కొనుగోలు చేసిన శివరాంకు ప్రసాదంలో ఓ ఐరెన్ బోల్ట్ కనిపించింది. దీంతో ఆశ్చర్యానికి గురైన శివరాం అధికారులను నిలదీశాడు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.