నేడు ఎన్టీఆర్‌ 25వ వర్ధంతి

* ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించనున్న చంద్రబాబు * రసూల్‌పురా నుంచి ఎన్టీఆర్‌ ఘాట్‌ వరకు అమరజ్యోతి ర్యాలీ * ర్యాలీలో పాల్గొననున్న బాలకృష్ణ, నందమూరి సుహాసిని

Update: 2021-01-18 03:07 GMT
ఎన్ఠీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్ఠీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పిస్తున్న నందమూరి బాలకృష్ణ 

ఇవాళ టీడీపీ వ్యస్థాపకుడు ఎన్టీఆర్‌ 25వ వర్ధంతి సందర్భంగా.. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులు నివాళులర్పించనున్నారు. రసూల్‌పురా ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి.. ఎన్టీఆర్‌ఘాట్‌ వరకు అమరజ్యోతి ర్యాలీ నిర్వహించనున్నారు. అమరజ్యోతి ర్యాలీని నందమూరి బాలకృష్ణ, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్‌ భవన్‌లో లెజెండరీ బ్లడ్‌ డొనేషన్‌ డ్రైవ్‌ చేపట్టనున్నారు. అనంతరం బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో రోగులకు బాలకృష్ణ పళ్లు అందించనున్నారు.

Tags:    

Similar News