Huzurabad: నాలుగు రోజులుగా ప్రభుత్వాస్పత్రిలో కరెంట్ లేక రోగుల ఇబ్బందులు

* నాలుగు రోజులుగా అవస్థలు పడుతున్న ప్రజలు * అంధకారంలోనే ఆస్పత్రి

Update: 2021-09-15 06:09 GMT

 హుజూరాబాద్‌ ప్రభుత్వాస్పత్రి (ఫైల్ ఫోటో)

Huzurabad: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఉన్న వంద పడకల ప్రభుత్వాస్పత్రిలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారు. మూడు, నాలుగు రోజులుగా ఆస్పత్రిలో కరెంట్ లేక అంధకారంలోనే ఉంటున్నారు. రాత్రి సమయంలో చీకటిలోనే ఉంటున్నారు రోగులు అయితే కరెంట్ విషయంలో ఆస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News