బీజేపీకి యువతే బలమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో అరవింద్ పర్యటించారు. ఎంపీగా గెలిచిన తర్వాత చేపట్టిన తొలి పర్యటనలో కేసీఆర్ను టార్గెట్ చేశారు. కవితను ఇంటికి పంపినట్టే త్వరలోనే కేటీఆర్ను, కేసీఆర్ను ఇంటికి పంపుతామని అర్వింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా పేరును ఇందూరుగా మారుస్తామని అర్వింద్ హామీ ఇచ్చారు.