హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీడియాతో మాట్లాడారు నారా భువనేశ్వరి. ఉల్లి ధరలపై నారా భువనేశ్వరి స్పందించారు. ఉల్లిపాయ ధరలు ఇంత పెరగడం నా జీవితంలో చూడలేదన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉల్లి ధరలపై సమీక్ష చేయాలని సూచించారు. భారీగా పెరిగిన ఉల్లి ధరలతో పేద, మధ్య తరగతి వారు చాలా ఇబ్బంది పడుతున్నారని వెంటనే ధరలు తగ్గే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు నారా భువనేశ్వరి.