కాల్వలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురు మృతి

Update: 2020-02-27 05:46 GMT
కాల్వలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురు మృతి

నల్గొండ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి ఏఎంఆర్పీ కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఓ బాలుడిని స్థానికులు రక్షించారు. కారు ముందు టైరు పేలడంతో కారు అదుపు తప్పి కాలువలోకి వెళ్లినట్లు స్థానికులు గుర్తించారు. మృతులు వడ్డెరిగూడేనికి చెందిన వారిగా గుర్తించారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. పీఏపల్లి మండలం దుగ్యాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహానికి హాజరై వస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిసింది. 

Tags:    

Similar News