నిజామాబాద్ కార్పొరేషన్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం హోరాహోరిగా తలపడుతున్నాయి. ఫలితాలు హంగ్ దిశగా సాగుతున్నాయి. మొత్తం 60 డివిజన్లకు గాను 24 డివిజన్లలో బీజేపీ విజయం సాధించింది. 19 డివిజన్లలో ఎం.ఐ.ఎం గెలుపొందింది. 15 డివిజన్లలో టీఆర్ఎస్ గెలుపొందింది. కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో మేయర్ పీఠంపై పార్టీల్లో ఆందోళన నెలకొంది. మేయర్ పీఠంపై పార్టీల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కౌంటింగ్ కేంద్రం చుట్టూ పోలీసులు మోహరించారు. కౌంటింగ్ కేంద్రం వద్దకు మూడు పార్టీల కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సీపీ కార్తికేయ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.