మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్కు దిమ్మతిరిగే తీర్పు ఇస్తారు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు బీజేపీ నేత డీకే అరుణ. ప్రజాప్రతినిధులను కేసీఆర్ డమ్మీలను చేశారని ఆరోపించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు బీజేపీ నేత డీకే అరుణ. ప్రజాప్రతినిధులను కేసీఆర్ డమ్మీలను చేశారని ఆరోపించారు. వరంగల్లోని వనపర్తిలో మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవలాంటిదన్నారు. కాంగ్రెస్ పార్టీకి నాయకులు ఉన్నా క్యాడర్ లేదని ఎద్దేవాచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కు దిమ్మతిరిగేల తీర్పు ఇస్తారని ఆమె అన్నారు. రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ పాలనపై అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రామచంద్రారావు మాట్లాడుతూ.. తెలంగాణలో కేంద్ర పథకాలను కేసీఆర్ ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఉద్యోగులను విస్మరించారని, నిరుద్యోగుల జీవితాలతోనూ కేసీఆర్ ఆడుకుంటున్నారని రామచంద్రరావు ఆరోపించారు.