తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం హత్య కేసు నిందితుడు సురేష్ మృతి చెందాడు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ చనిపోయాడు. 4 రోజులుగా ఆసుపత్రిలో సురేష్ చికిత్స పొందుతూ మరణించాడు. మరికాసేపట్లో అతడి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించనున్నట్లు తెలుస్తోంది. కాగా అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై రైతు సురేశ్ సోమవారం పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం విదితమే.