తెలంగాణలో తొలివిడత ZPTC, MPTC ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక కేంద్రాల్లో 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో 197 జడ్పీటీసీ, 2 వేల166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. తొలివిడతలో రెండు ZPTC స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. తొలి విడతలో 2 వేల 166 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయగా.. 69 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 2 వేల 97 స్థానాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహిస్తోంది. ఎంపీటీసీకి వైట్ కలర్, జడ్పీటీసీకి పింక్ కలర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు.