మంత్రి కేటీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహిరంగ లేఖ

Komatireddy Venkat Reddy: చేనేత కార్మికులను ఆదుకోవాలని లేఖలో ఎంపీ విజ్ఞప్తి

Update: 2022-03-03 10:45 GMT

మంత్రి కేటీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహిరంగ లేఖ

Komatireddy Venkat Reddy: అప్పుల ఊబిలో కూరుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న చేనేత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మంత్రి కేటీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. చేనేత కార్మికులకు చేనేత మిత్ర పథకం కింద రావాల్సిన 40 శాతం సబ్సిడీని 6నెలలు దాటినా ప్రభుత్వం మంజూరు చేయడంలేదని మంత్రి కేటీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. దీంతో చేనేత కార్మికులు ఇల్లు గడువక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలకోసారి అందాల్సిన సబ్సిడిని కూడా ప్రభుత్వం అందజేయడంలేదన్నారు. పట్టునూలు ధర కూడా విపరీతంగా పెరిగిపోవడంతో మాస్టర్ కార్మికులు పనిలేక మగ్గాలను బంద్ చేశారని లేఖలో వివరించారు. 

Tags:    

Similar News