వెయ్యి రూపాయలకు పాపను అమ్మకానికి పెట్టిన తల్లి

Update: 2019-08-13 09:33 GMT

వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏడు నెలల పాపను అమ్మకానికి పెట్టింది తల్లి. భార్యాభర్తల మధ్య గొడవ జరిగి నవమాసాలు మోసి కన్న కూతురుని వెయ్యి రూపాయలకు విక్రయానికి పెట్టింది. వరంగల్ బస్టాండ్ దగ్గర ఘటన వెలుగుచూసింది. జనగామ జిల్లా పెంబర్తికి చెందిన మహిళగా గుర్తించారు. పాప ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఎంజీఎం హస్పిటల్ కు తీసుకు వచ్చానని తల్లి చెబుతుంది. శిశువును అదుపులోకి తీసుకున్న పోలీసులు శిశుసంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.

Full View  

Tags:    

Similar News