Suryapet: సూర్యాపేటలో దారుణం

Suryapet: చిత్తూరు జిల్లా మదనపల్లి ఘటన మళ్లీ రిపీట్‌ అయ్యింది. మూఢనమ్మకం.. ముక్కపచ్చలారని ఓ చిన్నారి ప్రాణం తీసింది.

Update: 2021-04-16 07:49 GMT

కన్న బిడ్డను చంపిన తల్లి

Suryapet: చిత్తూరు జిల్లా మదనపల్లి ఘటన మళ్లీ రిపీట్‌ అయ్యింది. మూఢనమ్మకం.. ముక్కపచ్చలారని ఓ చిన్నారి ప్రాణం తీసింది. పూజల పేరుతో ఆరునెలల బిడ్డను కన్నతల్లే చంపేసింది. అతీతశక్తులు వస్తాయని ఆశపడింది. దోశం వీడుతుందని భ్రమ పడింది. దేవుడి పటం ముందు చిన్నారి గొంతు కోసి ఉసురు తీసింది. ఈ దారుణం తెలంగాణలోని సూర్యపేట జిల్లా మోతె మండలం మేకలపాడు తండాలో చోటుచేసుకుంది.

సూర్యపేట జిల్లా మేకలపాడు తండాకు చెందిన బానోత్‌ బుజ్జికి అదే తండాకు చెందిన కృష్ణతో రెండేళ్ల కిందట పెళ్లైంది. వీరికి 7 నెలలు చిన్నిరి ఉంది. ఇదిలా ఉండగా బుజ్జి సోషల్‌ మీడియాలో ఆధ్యాత్మిక వీడియోలకు అడిక్ట్‌ అయ్యింది, ఓ క్రమంలో తానే శివుడిగా భావిస్తూ ఉండేది. ఈ తండాకు వచ్చిన ఓ సాధువు.. ఆమెకు నాగదోషం ఉందని చెప్పాడు. ఈ వ్యాఖ్యమే.. ఆ బిడ్డ పాలిట శాపమైంది. ఆ సాధువు చెప్పిన నాటి నుంచి నిత్యం పూజలతోనే గడిపేది. నెమ్మదిగా ఆమె మానసికస్థితి మూఢవిశ్వాసానికి బానిసైంది.

నిన్న భర్త కృష్ణ పని మీద సూర్యాపేటకు వెళ్లాడు.. అత్తమామలు పొలం వద్దకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన బుజ్జి తన కూతురు రీతును దేవుడి పటం ముందు పడుకోబెట్టి బ్లేడుతో గొంతు కోసింది. తర్వాత ఏమీ తెలియనట్టు తన పుట్టింటికి వెళ్లింది. బిడ్డ ఎక్కడని బుజ్జి తల్లి ప్రశ్నించింది. మౌనంగా ఉండడంతో అనుమానం వచ్చిన బుజ్జి తల్లి ఇంటికి వెళ్లి చూసింది. ఆ ఇంట్లో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని చూసి ఉలిక్కిపడింది.

విషయం తెలుసుకున్న పోలీసులు తండాకు చేరుకొని పంచనామా నిర్వహించారు. బంధువుల ఫిర్యాదు మేరకు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

Tags:    

Similar News