PM Modi: తెలంగాణలో మూడ్రోజులపాటు మోడీ పర్యటన

PM Modi: ఈనెల 15, 16, 18 తేదీల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్న మోడీ

Update: 2024-03-13 09:41 GMT

PM Modi: తెలంగాణలో మూడ్రోజులపాటు మోడీ పర్యటన 

PM Modi: లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది. ఇప్పటికే రాష్ర్టంలో పలుమార్లు బీజేపీ అగ్రనేతలు రాష్ర్టంలో పర్యటనలు మొదలు పెట్టారు. ఈ నెల 15, 16, 18 తేదీల్లో ప్రధాని మోడీ మరోసారి తెలంగాణ పర్యటించబోతున్నారు. మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, జగిత్యాలలో బీజేపీ ప్రచారసభల్లో ప్రధాని పాల్గొంటారు. ఈనెల 15న మల్కాజ్‌గిరిలో రోడ్‌ షో, 16వ తేదీన నాగర్ కర్నూల్ లో, 18న జగిత్యాలలో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు. మోడీ పర్యటనతో తెలంగాణ బీజేపీ నేతలు సభా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు.

Tags:    

Similar News