Kavitha: ప్రభుత్వాలు మారాయి.. బిల్లుకు మోక్షం లభించలేదు

Kavitha: ఎమ్మెల్సీ కవిత ప్రెస్‌మీట్.. రేపు ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేపట్టాం

Update: 2023-03-09 08:49 GMT

Kavitha: ప్రభుత్వాలు మారాయి.. బిల్లుకు మోక్షం లభించలేదు

Kavitha: ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. విచారణ సంస్థలు ఎప్పుడు, ఎక్కడికి పిలిచినా వెళ్తానన్నారు. ఈడీ ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానం చెబుతానన్నారు. తమవైపు దేవుడున్నాడని.. విచారణకు భయపడేదిలేదన్నారు. బీజేపీతో స్నేహంగా ఉన్న రాజకీయ పార్టీలపై దర్యాప్తు సంస్థల దాడులు జరగవన్నారు ఎమ్మెల్సీ కవిత. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఇతరుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. మోడీ దాడులకు భయపడేదిలేదన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం కాదు.. పెరిగిన ధరలను తగ్గించేందుకు ప్రయత్నించాలన్నారు. తమ తండ్రి, సోదరుడే కాదు, తెలంగాణ మొత్తం తనకు మద్ధతుగా ఉందన్నారు.

Tags:    

Similar News