మానవత్వం చాటుకున్న ఎమ్మెల్సీ కవిత

Update: 2020-12-22 05:04 GMT

నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ కవిత రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళకు సాయం చేశారు. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. గాయాలతో స్పృహతప్పి పడిపోయిన మహిళకు ఆమె తెలంగాణ జాగృతి మహిళా నేతలతో కలిసి సపర్యలు చేశారు. అనంతరం ఆమెను వెంటనే సదరు స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుల సహాయంతో మహిళను హాస్పిటల్‌కు తరలించారు. మెరుగైన వైద్యసేవలు అందేలాచూడాలని ఆదేశించారు.

Tags:    

Similar News