కరోనా రూల్స్ ఉల్లంఘించి ఎస్ఐ వివాహం.. హాజరైన ఎమ్మెల్యే రేఖా నాయక్, పోలీస్ సిబ్బంది
నిర్మల్ జిల్లా ఖానాపూర్లో కరోనా నిబంధనలు ఉల్లంఘించి ఓ ఎస్ఐ పెళ్లి చేసుకున్నారు. కరోనా పై అలర్ట్ చేయాల్సిన పోలీస్ అధికారి బాధ్యత మరిచి వివాహం చేసుకున్నారు. కుబీర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ప్రదీప్ పని చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో పంక్షన్ హాల్స్ ను మూసివేశారు. అయితే, ఖానపూర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఎస్ఐ ప్రదీప్ పెళ్లి చేసుకున్నారు.
ఎస్ఐ పెళ్లికి ఎమ్మెల్యే రేఖా నాయక్, పోలీస్ సిబ్బంది విచ్చేశారు. పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు హాజరయ్యారు. విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు ఎస్ఐ వివాహంపై సీరియస్ అయ్యారు. ఫంక్షన్ హాల్ నిర్వాహకుడితో పాటు పెళ్లి కూతురి తండ్రిపై కేసు నమోదు చేశారు.