Minister Vemula: అపర భగీరథుడు సీఎం కేసీఆర్.. కలలో కూడా ఊహించలేదు..
Minister Vemula: గోదావరి జలాలను ఎగువకు తరలించిన కృషీవలుడు కేసీఆర్
Minister Vemula: అపర భగీరథుడు సీఎం కేసీఆర్.. కలలో కూడా ఊహించలేదు..
Vemula Prashanth Reddy: గోదారమ్మ ఎదురు ఎక్కుతదని కలలో కూడా ఊహించలేదు. నేడు అది నిజమైంది. రైతుల కల నెర వెరిన రోజు ఇది అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం ఎస్సారెస్పీ వరద కాలువకు కాళేశ్వరం జలాలు చేరుకోవడంతో నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి మండలం ఉప్లుర్ వద్ద కాళేశ్వరం జలాలకు మంత్రి పూజలు చేసి మాట్లాడారు.
అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. శ్రీరాంసాగర్ కు పునరుజ్జీవం కల్పించారని తెలిపారు. 281 కిలోమీటర్ల దూరం వరకు నీళ్లు మళ్లించారన్నారు. గోదావరి జలలాలను ఎగువకు తరలించిన కృషీవలుడు కేసీఆర్ అని అన్నారు. కాళేశ్వరంతో బీఆర్ఎస్ కు వస్తున్న ఆదరణ చూసి విపక్షాలు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.