ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ ఫైరయ్యారు. ప్రతిపక్షాలకు ఏ అంశాలు లేకపోవడంతో సమ్మెను పట్టుకున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా అని ప్రశ్నించారు. కొంతమంది యూనియన్ లీడర్ల అత్యూత్సాహంతోనే సమ్మె చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు తలసాని.