Seethakka: మహిళలు, పేదల అభ్యున్నతి కోసం ఇందిరాగాంధీ కృషిచేశారని కొనియాడారు మంత్రి సీతక్క. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నిర్వహించిన ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రస్తావించారు. ఇందిరాగాంధీ ఉన్నంతకాలం మహిళల అభివృద్ధి కోసం పాటుపడిందని అన్నారు. ఇందిరా మహిళ సంఘాల్లో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి సీతక్క అన్నారు.