రోడ్డు ప్రమాదంపై మంత్రి సత్యవతి రాథోడ్ దిగ్ర్భాంతి

జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Update: 2019-09-19 08:24 GMT

జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో మంత్రి సత్యవతి రాథోడ్ గారు స్వయంగా మాట్లాడారు. ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి‎ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంజూష ఆరోగ్య పరిస్థితి గురించి అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులు, చికిత్స పొందుతున్న మంజూషకు కావాల్సిన సాయాన్ని ఎమ్మెల్యే శంకర్ నాయక్ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అయితే ఈ తెల్లవారు జామునా జనగామ జిల్లాలోని దేవరుప్పల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగింది. కారును- డీసీఎం ఢీ కొట్టడంతో పెనుగొండ గణేష్,పెనుగొండ సుకన్య, డ్రైవర్ నజీర్, శ్రీలత మరణించిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News