Sabitha Indra Reddy: ఏప్రిల్ 3 నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బ‌స్సుల్లో ఫ్రీ జ‌ర్నీ..

Sabitha Indra Reddy: ఏప్రిల్ 3 నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బ‌స్సుల్లో ఫ్రీ జ‌ర్నీ..

Arun Chilukuri
Published on: 29 March 2023 6:30 PM IST
Minister Sabitha Indrareddy Review On Tenth Exams
X

Sabitha Indra Reddy: ఏప్రిల్ 3 నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బ‌స్సుల్లో ఫ్రీ జ‌ర్నీ..

Sabitha Indra Reddy: ఏప్రిల్ 3వ తేది నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురి కాకుండా సిద్ధం కావాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసి, వారిలో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఉందన్నారు. లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతున్న పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. విద్యార్థులు త‌మ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story