ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రి పువ్వాడ
తెలంగాణా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బస్సులో ప్రయాణం చేశారు.
తెలంగాణా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బస్సులో ప్రయాణం చేశారు. ఖమ్మం నుంచి కొత్తగూడెం వరకు అయన బస్సులో ప్రయాణం చేశారు. అయనతో పాటు ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్ లు కూడా బస్సులో ప్రయాణించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు నెలకోసారి బస్సులో ప్రయాణించాల్సిందిగా కోరుతూ మంత్రి పువ్వడా ప్రజాప్రతినిధులకు లేఖ రాశారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వడా ఆర్టీసీని లాభాల్లో నడిపించడమే ప్రభుత్వ లక్ష్యమని, త్వరలోనే ఆర్టీసీలో కార్గో సేవలను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రయాణికులకి మెరుగైన లక్ష్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, నిర్మాణంలో ఉన్న బస్టాండ్ లను త్వరలో పూర్తి చేస్తామని, ఉద్యోగుల సహకారంతో ఏడాదిలో మార్పు చూపిస్తామన్నారు మంత్రి పువ్వాడ