సీతారాం నాయక్ కు నామినేటెడ్ పోస్టు..ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కు మంత్రి పదవి..?

Update: 2019-09-04 12:35 GMT

తెలంగాణ లో పదవుల కోసం నేతల లాబీయింగ్ ఊపందుకుంది. కేబినెట్ ర్యాంకు పదవులుపైనా, మంత్రిపదవులపైనా కన్నేసిన టీఆరెస్ నేతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలుస్తున్నారు. మంత్రి పదవి లేదా పార్టీ పరంగా ఏదో పదవిని ఆశించే వారంతా తెలంగాణ భవన్ కు క్యూ కడుతున్నారు. ఆశావహులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలుస్తున్నారు. ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, అల్లా వెంకటేశ్వర్ రెడ్డి, గ్యాదరి కిషోర్, భాస్కర రావు, సుమన్, జోగురామన్న,కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి కేటీఆర్ ను కలసిన వారిలో ఉన్నారు. ఇక ఎంపీ మాలోతు కవిత కూడా కేటీఆర్ ను కలసి హామీ పొందినట్లు సమాచారం. వీరేకాక మాజీ ఎంపీ సీతారాం నాయక్ కు నామినేటెడ్ పోస్టు హామీ దొరికి నట్లు, వారంలోగా పదవులు ప్రకటించనున్నట్లు కేటీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కు మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా సత్యవతి రాథోడ్ కు మంత్రి పదవి ఖాయమని కేటీఆర్ భరోసా ఇచ్చినట్లు సమాచారం.

Full View

Tags:    

Similar News