ఖమ్మం టీఆర్ఎస్‌ నేతలకు కేటీఆర్ క్లాస్

Update: 2021-01-21 13:30 GMT

ఖమ్మం టీఆర్ఎస్‌ పంచాయతీ ప్రగతిభవన్‌కు చేరింది. ఖమ్మం టీఆర్ఎస్‌ నేతలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లాస్ పీకారు. అందరినీ కలుపుకుంటూ సమన్వయంతో పనిచేయాలని నేతలకు సూచించారు. పార్టీలో ఎమ్మెల్యేల తీరు దురుసుగా ఉందన్న కేటీఆర్ ఎమ్మెల్యేలు ఉంటారు పోతారు కానీ, పార్టీ బలంగా ఉండటం ముఖ‌్యమన్నారు. పువ్వాడ అజయ్‌ కేవలం ‌ఖమ్మం జిల్లాకే మంత్రి కాదని పార్టీ నేతలకు గుర్తుచేశారు. ఇక, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తీరాలని ఖమ్మం టీఆర్ఎస్ నేతలకు కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

Full View


Tags:    

Similar News