KTR: జల జగడంపై మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్

KTR: కృష్ణా జలాల విషయంలో రాజీపడేదే లేదు: కేటీఆర్ * ఏపీతోనే కాదు, అవసరమైతే దేవుడితో కోట్లాడతాం: కేటీఆర్

Update: 2021-07-10 14:37 GMT

మంత్రి కేటీఆర్ (ఫోటో ది హన్స్ ఇండియా)

KTR: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్.. కృష్ణా జలాల విషయంలో ఎవరితోనూ రాజీపడేది లేదని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం తమకు రావాల్సిన నీటి కేటాయింపులకోసం పోరాడుతామన్న మంత్రి.. కేసీఆర్ నాయకత్వంలో ఏపీతోనే కాదు, అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడుతామని హాట్ కామెంట్స్ చేశారు. అంతిమంగా తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని కేటీఆర్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News