దివంగత చెరుకు ముత్యంరెడ్డి.. రైతు బాంధవుడు అని.. ఆయన అడుగుజాడల్లో నడుస్తామని.. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా తొగూట మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ముత్యంరెడ్డి సంస్మరణ సభలో.. హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రాంలింగారెడ్డి.. ఘనంగా నివాళులు అర్పించారు. సర్పంచ్ నుంచి మంత్రిగా ఎదిగిన నేతగా.. రైతులకు ఆపద్భాందవుడిగా ముత్యంరెడ్డికి నియోజకవర్గంలో మంచి పేరుందని హరీశ్రావు కొనియాడారు. త్వరలోనే తొగూటలో ముత్యంరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని.. తెలిపారు.