నా వాహనం ఇచ్చి మిమ్మల్ని మధ్యప్రదేశ్ పంపిస్తా: హరీష్‌రావు హామీ

Update: 2020-04-23 12:03 GMT

సిద్ధిపేట ఏరియా ఆస్పత్రిలో మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్రేతర వలస కుటుంబీకులను హరీష్‌రావు పరామర్శించారు. రాష్ట్రేతరులకు కూడా నిత్యావసర వస్తువులు, నగదు అందిస్తామన్నారు. 'మే 7న లాక్‌డౌన్ పూర్తయ్యాక.. నా వాహనం ఇచ్చి మిమ్మల్ని మధ్యప్రదేశ్ పంపిస్తా.. అప్పటిదాకా మీకు అన్నం పెట్టి జీవనోపాధి కల్పిస్తా' అని హరీష్‌రావు వారికి హామీ ఇచ్చారు. ఇంత ఎండలో కాలినడకన వెళ్లడం మంచిది కాదని, అప్పటి వరకు ఇక్కడే ఉండాలని మంత్రి హరీష్ రావు సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే ఫోన్‌ చేయాలని తన నంబర్‌ ఇచ్చారు.

Tags:    

Similar News