షర్మిల వ్యాఖ్యలఫై మంత్రి హరీష్‌ రావు పరోక్షంగా కౌంటర్‌

* తెలంగాణ రైతుల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శ * రైతు సంక్షేమం కోసం ఖర్చు చేసి బడ్జెట్ పై అవగాహన ఉందా?

Update: 2021-02-10 10:26 GMT

file image 

తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించిన షర్మిలకు మంత్రి హరీష్‌‌ రావు పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణ రైతుల గురించి ఎవరో వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. వాళ్లకు ఏమైనా అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో రైతు సంక్షేమం కోసం ఖర్చు చేసి బడ్జెట్ మీద అవగాహన ఉండే మాట్లాడుతున్నారా? అని నిలదీశారు. ఏపీ ప్రభుత్వం రైతుకు కేవలం 12,500 రూపాయలు ఇస్తే, తెలంగాణలో ప్రతీ ఎకరాకు 10 వేల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు.

Tags:    

Similar News