‌‌Harish Rao: ఈటల గెలిస్తే ప్రజలకు ప్రయోజనం ఉండదు

‌‌Harish Rao: ఈటలపై విరుచుకుపడ్డ మంత్రి హరీశ్ రావు

Update: 2021-10-21 15:26 GMT

ఈటెల రాజేందర్ పై  మండిపడ్డ హరీష్ రావు (ఫైల్ ఇమేజ్)

‌‌Harish Rao: ఓడిపోతానన్న భయంతో ఈటల రాజేందర్ విపరీత వాఖ్యలు చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా.. టీఆర్‌ఎస్‌పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వావిలాల టీఆరెస్ ధూం ధాం కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈటల గెలిచినా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం ఉండదన్నారు. గెల్లు శ్రీనివాస్ గెలిస్తేనే ప్రజల సమస్యలు తీరుతాయన్నారు. ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 

Tags:    

Similar News