Harish Rao: కాంగ్రెస్పై మంత్రి హరీష్రావు ఫైర్.. ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు కాబట్టే 24 గంటల కరెంట్
Harish Rao: ప్రత్యేక రాష్ట్రం వచ్చాక పరిస్థితులు మారాయి
Harish Rao: కాంగ్రెస్పై మంత్రి హరీష్రావు ఫైర్.. ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు కాబట్టే 24 గంటల కరెంట్
Harish Rao: కాంగ్రెస్పై మంత్రి హరీష్రావు ఫైరయ్యారు. తెలంగాణలో కరెంట్ బాధలు లేవని.. ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు కాబట్టే.. 24 గంటలు కరెంట్ అందుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక పరిస్థితులు మారాయన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డ్ లో ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ అధ్వర్యంలో రైతులకు తుంపర సేద్య పరికరాలు పంపిణి చేసిన మంత్రి.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతాంగానికి పెద్ద పీట వేశామన్నారు. కాలంతో పని లేకుండా కాళేశ్వరం ద్వారా సాగు నీరు అందిస్తున్నామని... ప్రతిపక్షాలు కాళేశ్వరం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.