భారత్లో రెండు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఢిల్లీలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే కరోనాపై తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యింది. వైద్యశాఖ అధికారులతో మంత్రి ఈటల సమావేశమయ్యారు.
కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ రావడంతో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనాను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. తాజాగా మరో రెండు కేసులు నమోదు కావడంతో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేయోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.