ములుగు జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన

*పూసూరు బ్రిడ్జి వద్ద ఉధృతంగా గోదావరి.. పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Update: 2022-07-16 07:15 GMT

ములుగు ఏజెన్సీ ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao: ములుగు జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా వాజేడు మండలంలోని పూసూరు బ్రిడ్జి నుంచి గోదావరి ప్రవాహాన్ని మంత్రి పరిశీలించారు. వరద ఉధృతిని, ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ముంపు ప్రాంతాల్లో నిర్వహించిన సహాయకచర్యలతో పాటు.. ప్రస్తుత పరిస్థితిని బ్రిడ్జీపైనే ఉండి సమీక్షించారు.

Tags:    

Similar News