వలసకూలీలకు తప్పిన ప్రమాదం

Update: 2020-05-04 05:57 GMT

హైదరాబాద్‌ నుంచి రాజస్థాన్‌ వెళ్తున్న వలస కూలీలు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వలసకూలీలతో వెళ్తున్న బస్సు నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌ వద్ద అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలు కాగా.. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. ఎమ్మార్వో ఇలియాస్‌ అహ్మద్‌ వారికి స్థానిక పాఠశాలలో ఆశ్రయం కల్పించి, అల్పాహారం అందించారు. అధికారులు ప్రత్యామ్నాయంగా మరో బస్సును ఏర్పాటు చేసి కూలీలను తరలించారు. 

Tags:    

Similar News