తెలంగాణ కాంగ్రెస్ క్రమంగా ఖాళీ అవుతోంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, పి.సబితారెడ్డి, హరిప్రియా నాయక్, కె.ఉపేందర్రెడ్డి, డి.సుధీర్రెరెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, వనమా వెంకటేశ్వర్రావు, జాజుల సురేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేల చేరికకు ముహూర్తం ఖరారైందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. వారిద్దరూ కూడా చేరితే కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ విలీనం అవుతుందని ఆ చెబుతోంది.
ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు టీఆరెస్ లో చేరుతుండగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు చేరడానికి రెడీ గా ఉన్నారు. దీంతో మొత్తం 13 మంది సంతకాలు సేకరించి శాసనసభ స్పీకర్కు లేఖ ఇవ్వాలని నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే ఈ ప్రక్రియ ముందకు సాగకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం చేయడానికి సిద్ధమైంది.