మెదక్ బీజేపీ అభ్యర్థిగా రఘనందన్ రావు

Update: 2019-03-24 15:55 GMT

ఇప్పటికే 16 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన తెలంగాణ బీజేపీ.. మరో పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించింది. మెదక్ పార్లమెంట్ టిక్కెట్ ను ఆ పార్టీ నేత రఘనందన్ రావుకు ఇచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి పార్టీలో చేరితే మెదక్ టిక్కెట్ ఆమెకు కెటాయించాలని భావించినప్పటికీ చివరి క్షణంలో రఘనందన్ రావుకు ఖరారు చేసింది.

బీజేపీలో గూటికి చేరితే మెదక్ ఎంపీగా, పార్టీలో మంచి స్థానం కల్పిస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చినప్పటికీ సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆఖరినిమిషం వరకు వేచిచూసి రఘునందన్ రావును ఎంపిక చేసింది బీజేపీ. దీంతో తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది.  

Similar News