మర్కజ్ ప్రార్థనలు.. నిజామాబాద్ జిల్లాలోనూ కలకలం రేపుతున్నాయి. జిల్లా నుంచి సుమారు 39 మంది ప్రార్థనలకు హాజరైనట్లు లెక్కించారు. దీంతో వారందరినీ క్వారంటైన్ కు తరలించారు. ఈ 39 మందితో సన్నిహితంగా ఉన్న మరో 55 మందిని కూడా క్వారంటైన్కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే వీరిలో ఏ ఒక్కరికీ కరోనా లక్షణాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే వారిని క్వారంటైన్కు తరలించినట్లు తెలిపారు.