మీకో న్యాయం మాకో న్యాయమా ‌: మందకృష్ణ

Update: 2019-12-23 02:48 GMT
మందకృష్ణ

దిశ హత్య కేసు నిందితులను చటాన్ పల్లిలో పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎన్‌కౌంటర్‌ సంఘటనపై ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రంగా స్పందించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఓ ఫంక్షన్‌ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కారక్యక్రమానికి హాజరైన ఆ‍యన మాట్లాడుతూ నిందితుల తరుఫున అడిగేవాళ్లు లేరనే ఉద్దేశంతోనే ఎన్‌కౌంటర్‌ పేరుతో హతమార్చారని  ఆరోపించారు. దళిత బహుజనులకు ఒక న్యాయం..అగ్రకుల మహిళలకు ఒక న్యాయమా అనే అంశం పై చర్చించారు. బడుగు, బలహీన వర్గాల వారు

నిందితులు కావడంతోనే ఎన్‌కౌంటర్‌ పేరుతో అంతమొందించారని ధ్వజమెత్తారు. దిశ అగ్రకులానికి చెందిన యువతి కావడంతోనే పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారని మందకృష్ణ ఆరోపించారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు బుర్ర రాంచం ద్రయ్య, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.




Tags:    

Similar News