భార్యతో గొడవ వద్దని చెప్పిన పాపానికి దారుణం

Update: 2020-02-04 05:17 GMT
భార్యతో గొడవ వద్దని చెప్పిన పాపానికి దారుణం

జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం ఎస్రాజ్‌పల్లిలో కాల్పుల కలకలం సృష్టించాయి. బైరవేణి రాజిరెడ్డిపై సమీప బంధువు అయిన శ్రీనివాస్‌ కాల్పులు జరిపాడు. భార్యతో వాగ్వాదానికి దిగిన శ్రీనివాస్‌కు రాజిరెడ్డి అడ్డుచెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో రాజిరెడ్డిపై రివాల్వర్‌తో శ్రీనివాస్‌ కాల్పులు జరిపాడు. రాజిరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.

కాల్పుల ఘటనలో విచారణ కొనసాగుతోంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు గతంలో జనశక్తిలో స్వల్ప కాలం పని చేసినట్లు తెలుస్తోంది. అనంతరం పోలీసులకు లొంగిపోయి జనజీవన సృవంతిలో కలిసిపోయాడు.

Tags:    

Similar News